
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం పంటి చికిత్స చేయించుకున్నారు. పదేండ్లుగా పర్సనల్ డెంటిస్ట్గా ఉన్న డాక్టర్ దగ్గరకు ఆయన వెళ్లారు. బుధవారం మరోసారి రావాల్సిందిగా డాక్టర్ సూచించినట్టు సమాచారం. కేసీఆర్ భార్య శోభ బుధవారం ఎయిమ్స్లో హెల్త్ చెకప్ చేయించుకోనున్నారు. కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పోయినసారి సీఎం ఢిల్లీ టూర్ సందర్భంగా ఆమె ఎయిమ్స్లోనే చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వివరాలను సీఎంవో రహస్యంగా ఉంచింది. పర్యటనలో భాగంగా కొందరు జాతీయ నేతలు, పలు పార్టీల సీఎంలతో కేసీఆర్ సమావేశమవుతారని ప్రచారం జరిగినా.. తొలిరోజు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను కూడా సీఎంవో దూరం పెట్టినట్టు సమాచారం. అధికారిక సమాచారం అయితేనే భవన్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాద్ తిరుగుపయనమవుతారని అధికారులు చెప్పారు. కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్కు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్లో ఆయన స్టాలిన్తో మాట్లాడారు. కేసీఆర్కు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.