- రాష్ట్రాలను హెచ్చరించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన స్పెషల్ ఆర్డినెన్స్ రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాల్లోనూ తీసుకువస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ జూన్11న ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పుడు ఢిల్లీపై దాడి చేస్తోందని రానున్న రోజుల్లో మిగతా రాష్ర్టాల హక్కులను కాలరాసే మరిన్ని ఆర్డినెన్స్లను తీసుకువస్తుందని విమర్శించారు. ఈ ఆర్డినెన్స్తేవడం అంటే ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం హక్కులను కాలరాసి, కేంద్రం కనుసన్నల్లో నడిచే లెఫ్టినెంట్ గవర్నర్ ఆధిపత్యం చెలాయిస్తారని వ్యంగ్యస్ర్తాలు సంధించారు.
ప్రధానిపై విమర్శలు..
ప్రధాని మోడీతో పాటు బీజేపీ టార్గెట్గా కేజ్రీవాల్విమర్శలు చేశారు. దేశ రాజ్యాంగాన్ని మార్చి ప్రజలను ప్రధాని మోడీ అవమానించారని, ఇన్నేళ్లలో ఇలాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని అన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తాను పాటించబోనని మోడీ అంటున్నారని అది ఆయన నియంతృత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆర్డినెన్స్లని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ నియంతృత్వానికి ముగింపు పలికే మూమెంట్ దేశ రాజధాని నుంచే ప్రారంభించాలని పిలుపునిచ్చారు.