రాఫెల్ రచ్చ.. సీఎం రేవంత్ స్పీచ్ పై బీజేపీ వివాదం

రాఫెల్ రచ్చ.. సీఎం రేవంత్ స్పీచ్ పై  బీజేపీ వివాదం
  • కౌంటర్ అటాక్ కు దిగిన కాంగ్రెస్  పార్టీ
  •  సోషల్ మీడియా వేదికగా కమలం రచ్చ
  • జాతీయ మీడియాలోనూ కథనాలు

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉండి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్  ను తప్పక స్వాధీనం చేసుకునేవారని, ట్రంప్ కు తలొగ్గి యుద్ధం విరమించారని నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు కలకలం రేపాయి. బలూచిస్తాన్ ను విడదీయాలని, గొప్పలకు పోయి తిరంగా ర్యాలీ తీస్తారా..? అంటూ ప్రశ్నించారు. ట్రంప్ కు తలొగ్గి యుద్ధాన్ని మధ్యలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని అన్నారు. ఇది ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇది పాక్ కు అనుకూలంగా మాట్లాడటమేనని బీజేపీ అంటోంది. మోదీ ఎందుకు యుద్ధం ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు.. తిరంగా ర్యాలీలు తీయడ కాదు దమ్ముంటే పీవోకేను గుంజుకోవాలంటూ కామెంట్ చేశారు. బలూచిస్తాన్ ను విడదీయాలని అన్నారు. అది చేయాలంటే ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం ఉన్న నేత కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన వశమయ్యే దని చెప్పారు. 

►ALSO READ | రహస్యంగా కలుసుకున్నరు.. ఒక్కటే సమాధానం చెప్పాలని డిసైడయ్యారు

ఈ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సోషల్ మీడియాలు వైరల్ చేస్తున్నాయి.  ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలనే రాహుల్ గాంధీ కూడా నిన్న సంధించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎన్ని రాఫెల్ జెట్లను కోల్పోయిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిని బీజేపీ నాయకులు తప్పు పడుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఎందుకు మాట్లాడుతున్నారంటూ కౌంటర్ అటాక్ కు దిగుతున్నారు. అటు పాకిస్తాన్ మాత్రం భారత్ కు చెందిన మూడు జెట్లు కూల్చివేశామని, అందులో రాఫెల్ కూడా ఉందని  చెప్పుకుంటోంది.  యుద్ధం ఆపాలని చెప్పేందుకు ట్రంప్ ఎవరని కాంగ్రెస్ ప్రశ్నిస్తుండగా.. బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పాకిస్తాన్  కు మేలు చేసేలా ఉన్నాయని అంటోంది. ఈ వివాదం రెండు పార్టీల మధ్య కొత్త చర్చకు దారి తీసింది.