
- పోలీసులకు సీఎం ఆదేశాలు
- గణేశ్ నిమజ్జనంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ
హైదరాబాద్, వెలుగు : ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద వినాయక నిమజ్జనాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్రెడ్డి పోలీసులను ఆదేశించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సూచించారు.
గణేశ్ నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్లకు సంబంధించి రికార్డు మెయింటనెన్స్ చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలనిఆదేశించారు.