హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ సినిమాను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వీక్షించారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్కు వెళ్లి సినిమా చూశారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
