
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి దగ్గరలోని గోపన్పల్లి తండా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.
రూ.25 కోట్లతో 980 మీటర్ల పొడవుతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. మార్చిలోనే పనులు పూర్తి కాగా, లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఓపెనింగ్ వాయిదా పడింది. గౌలిదొడ్డి నుంచి ఎంట్రీ అయ్యే వెహికల్స్ను ఈ ఫ్లై ఓవర్ మీదుగా తెల్లాపూర్, నల్లగండ్ల వైపు డైవర్ట్ చేస్తారు. నానక్రామ్గూడ, గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చందానగర్, శేరలింగంపల్లి వెళ్లేందుకు ఈ ఫ్లై బాగా ఉపయోగపడనుంది.