తీరనున్న ట్రాఫిక్ కష్టాలు ఇవ్వాల గోపన్​పల్లి ఫ్లై ఓవర్ ఓపెనింగ్

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు ఇవ్వాల గోపన్​పల్లి ఫ్లై ఓవర్ ఓపెనింగ్

హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి దగ్గరలోని గోపన్​పల్లి తండా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్​ను సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.

రూ.25 కోట్లతో 980 మీటర్ల పొడవుతో ఈ ఫ్లై ఓవర్‌‌‌‌ను నిర్మించారు. మార్చిలోనే పనులు పూర్తి కాగా, లోక్​సభ ఎన్నికల కోడ్ కారణంగా ఓపెనింగ్ వాయిదా పడింది. గౌలిదొడ్డి నుంచి ఎంట్రీ అయ్యే వెహికల్స్​ను ఈ ఫ్లై ఓవర్ మీదుగా తెల్లాపూర్, నల్లగండ్ల వైపు డైవర్ట్ చేస్తారు. నానక్​రామ్​గూడ, గచ్చిబౌలిలోని సాఫ్ట్​వేర్ ఎంప్లాయీస్ చందానగర్, శేరలింగంపల్లి వెళ్లేందుకు ఈ ఫ్లై బాగా ఉపయోగపడనుంది.