- కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర పార్టీ పదవులపై చర్చించే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గురువా రం కాంగ్రెస్ పెద్దలను కలువనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్కు చేరుకొని.. వారితో భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీని సీఎం కలవనున్నట్లు సీఎంవో వర్గాలు తెలి పాయి.
బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరు కున్న సీఎం రేవంత్ రెడ్డి.. నేరుగా తుగ్లక్ రోడ్ లోని తన అధికారిక నివాసానికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. గురువారం పార్లమెంట్లో పార్టీ పెద్దలను కలిసి.. ప్రపంచస్థాయి పెట్టుబ డులను ఆకర్షించేలా రెండు రోజులపాటు నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ –2047’ గ్లోబల్ సమిట్ వివరాలను పంచుకోనున్నట్లు తెలిసింది.
అలాగే, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ పదవులపై డిస్కషన్ చేయనున్నారు. పార్లమెంట్కు వెళ్తున్నందున.. రాష్ట్రా నికి సంబంధించిన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. కాగా.. మధ్యాహ్నం ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు.

