సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వాయిదా

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వాయిదా

తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగాల్సి ఉండగా రేపటికి వాయిదా పడింది. ఢిల్లీలో ఈరోజు విపక్ష పార్టీలు సేవ్ డెమొక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించడంతో పాటు రాంలీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో సీఈసీ సమావేశం వాయిదా పడింది.  

దీంతో  రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంశంలో సస్పెన్స్ కొనసాగుతోంది.  ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్,  వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. రేపు ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ రానుంది.