ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది: ఎమ్మెల్యే పోచారం

ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది: ఎమ్మెల్యే పోచారం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైం దన్నారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయలేదు.. కాంగ్రెస్ ఎందుకు గెలిపించుకున్నామని ప్రజలు, అధికారులు బాధపడుతున్నారని పోచారం విమర్శించారు. 

ALSO READ | రైతుకు ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్‌

బీఆర్ ఎస్ పార్టీ, కేసీఆర్ పదేళ్ల పాటు ఒక స్వర్ణయుగంలా పాలించారని అన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. కార్యకర్తలే పార్టీలకు కీలక, వారిని కాపాడుకోవాల్సి బాధ్యత నాయకులపై ఉంద న్నారు. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉంది..బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే సంస్కృతి బీజేపీ పార్టీదీ.. గాలా అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.