
జన్నారం, వెలుగు: రూ.200 కోట్ల వ్యయంతో ఖానాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని హర్షిస్తూ గురువారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, కాంగ్రెస్నేతలుసయ్యద్ ఇసాక్, ఇందయ్య, కరుణాకర్, రమేశ్, అజహర్, రాజన్న, సాకీర్, గంగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.