సీఎం గారు.. నా చావుకు మీరే కారణం.. దళితబంధు రావడం లేదని యువకుడి సూసైడ్

సీఎం గారు.. నా చావుకు మీరే కారణం.. దళితబంధు రావడం లేదని యువకుడి సూసైడ్

జైనథ్, వెలుగు: తన చావుకు సీఎం కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఆదిలాబాద్​జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్(26) గురువారం ఉదయం బయటకు వెళ్లి, సాయంత్రం బోరజ్ గ్రామ శివారులో పురుగుల మందు తాగి శవమై కనిపించాడు. అతడు మృతి చెందిన స్థలంలో ఓ సూసైడ్ నోట్ దొరికింది.

అందులో.. ‘అవ్వ, బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం సార్​ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు. నా చావుకు మీరే కారణం’’అంటూ సూసైడ్ నోట్ లో తనకు వచ్చిన భాష, పదాలతో రాశారు. కాగా తమ కుమారుడికి దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తల్లిదండ్రులు నర్సింగ్, చంద్రబాగా బోరుమన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం రిమ్స్ కు తరలించారు.