- కమిషనర్ కె.గోవర్ధన్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలందించేందుకు ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎంపీఎఫ్(కోల్ మైన్స్ ప్రావిడెంట్ఫండ్) రీజినల్ కమిషనర్-2 డాక్టర్ కె.గోవర్ధన్ అన్నారు. గురువారం మందమర్రి ఏరియా జీఎం ఆఫీస్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎంపీఎఫ్, పెన్షన్కు సంబంధించిన లావాదేవీలు సికేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నారు.
సీఎంపీఎఫ్ పెన్షన్ క్లెయిమ్స్ పూర్తిచేయడానికి కొత్తగా ‘పయాస్’ పద్ధతిని తీసుకొచ్చామని తెలిపారు. కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని.. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలను పారదర్శకంగా పొందాలని సూచించారు.
ఈ సందర్భంగా 375 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ (ఫార్మర్ అండ్సర్వైవర్) సెటిల్మెంట్ కాపీలను సంబంధిత అధికారులకు అందజేశారు. మందమర్రి ఏరియా డీజీఎం(పర్సనల్) సీహెచ్.అశోక్, సీనియర్పర్సనల్ఆఫీసర్రావికంటి సత్యనారాయణ, సీఎంపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాస్రావు, ఎస్ఎస్వోలు కె.వరప్రసాద్, ఎ.రాఘవేంద్ర, కె.వెంకటరెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
