ప్యాట్నీ ఫ్లై ఓవర్ పై ఢీకొన్న రెండు కాలేజీ బస్సులు

ప్యాట్నీ ఫ్లై ఓవర్ పై ఢీకొన్న రెండు కాలేజీ బస్సులు

సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్ పై ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. CMR కాలేజీకి చెందిన రెండు బస్సులు విద్యార్థులను ఇంటిదగ్గర ఎక్కించుకుని కాలేజీకి తీసుకెళ్తున్నాయి. ఈ రెండు బస్సులు సికింద్రాబాద్ ఫై ఓవర్ పైకి రాగానే ముందు వెలుతున్న బస్సు సడన్ బ్రేక్ వేసింది. దీంతో.. వెనకాల వస్సున్న బస్సు ముందు ఉన్న బస్సును గుద్దుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలయి, రక్తాలు కారాయి. వెంటనే స్పంధించిన స్థానికులు స్టుడెంట్స్ ను హస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన తో ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరుగలేదని తెలిపారు పోలీసులు. ప్రమాదానికి గురైన బస్సుకు నెంబర్.. ఏపి 25 వి 6255.