ఫంక్షన్ హాళ్లో కోచింగ్ సెంటర్.. కరోనా భయం లేకుండా వందలమంది ఒకేచోట

ఫంక్షన్ హాళ్లో కోచింగ్ సెంటర్.. కరోనా భయం లేకుండా వందలమంది ఒకేచోట
  • బెంచికి నలుగురు.. క్లాసులో వంద మంది!
  • కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల్లో కరోనా గైడ్​లైన్స్​ గాలికి
  • ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోని మేనేజ్ మెంట్లు
  • బెంచీలు, బాత్రూంల క్లీనింగ్ పైనా పట్టింపు కరువు
  • ఇష్టమొచ్చినట్టు కోచింగ్ సెంటర్ల నిర్వహణ

ఇది హైదరాబాద్​లోని ఓ ఫంక్షన్​ హాల్​. మస్తు మంది జనాలున్నరు కదా అని ఇక్కడ పెళ్లో లేదంటే వేరే ఏదో ఫంక్షనో జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. అక్కడ ఏ ఫంక్షనూ జరగట్లేదు. క్లాసులు జరుగుతున్నయి. జాబ్స్​ కోసం కోచింగ్​ తీసుకుంటున్న అభ్యర్థులు వీళ్లంతా. సర్కారు పెట్టిన కరోనా రూల్స్​ను పట్టించుకోకుండా ఓ కోచింగ్​ సెంటర్​ వాళ్లు ఇలా వందలాది మందిని ఫిజికల్​ డిస్టెన్స్​ లేకుండానే కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారు మరి.

హైదరాబాద్​, వెలుగు: ‘‘బెంచికి ఒక్కరే కూర్చోవాలె. స్కూల్​ అయితే క్లాసులో 20 మంది.. కాలేజీ అయితే 30 మందిని మాత్రమే కూర్చోబెట్టాలి. ఎక్కువమంది ఉంటే వేరే సెక్షన్లు పెట్టి క్లాసులు చెప్పాలె’’ నెల రోజుల క్రితం విద్యాశాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ చిత్రా రామచంద్రన్​ ఇచ్చిన గైడ్​లైన్స్​ ఇవీ. కానీ, వాటితో తమకేం సంబంధమన్నట్టు వ్యవహరిస్తన్నాయి కార్పొరేట్, ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీలు. కరోనా గైడ్​ లైన్స్​ను గాలికి వదిలేశాయి. బెంచికి ముగ్గురు, నలుగురు చొప్పున ఒక్కో క్లాసులో వంద మంది స్టూడెంట్స్​ను కూర్చోబెడుతున్నాయి. విద్యాశాఖ అధికారులూ తమకేం పట్టనట్టు ఉంటున్నారు. దీనిపై ప్రశ్నించినా మేనేజ్​మెంట్లు స్పందించట్లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

కాలేజీల వైపే చూడని ఆఫీసర్లు

సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో కరోనా రూల్స్​ పాటిస్తున్నారో లేదో పరిశీలించేందుకు స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ అబ్జర్వర్లనూ నియమించారు. అయితే, వాళ్లు కేవలం సర్కార్​ స్కూళ్లు, కాలేజీల్లోనే పరిశీలన చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆ కాలేజీలు ఎలా నడుస్తున్నాయన్నది కూడా ఇంటర్​ బోర్డు ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ రెండు సార్లు బెంచీలను, బాత్రూంలను క్లీన్​ చేయాలన్న రూల్స్​నూ మేనేజ్​మెంట్లు పట్టించుకోవట్లేదు.

కల్యాణ మండపాల్లో కోచింగ్​ సెంటర్లు!

కోచింగ్ ​సెంటర్లపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ స్కూళ్లు, కాలేజీలతో పాటు అవీ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్​లో కల్యాణ మండపాల్లో కొన్ని కోచింగ్​ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వందలాది మందికి క్లాసులు చెబుతున్నారు. విద్యా సంస్థల రీ ఓపెనింగ్​పై ఇచ్చిన గైడ్​లైన్స్​లో ఎక్కడా వాటి పేరును సర్కారు ప్రస్తావించలేదు. దీంతో వాటికి పర్మిషన్​ లేదని అధికారులు చెబుతున్నారు. నైన్త్​ ఆపై క్లాసులకు అనుమతిచ్చారు కాబట్టి, తమకూ పర్మిషన్​ వచ్చినట్టేనని నిర్వాహకులు అంటున్నారు.

చర్యలు తీసుకోవాలె

కోచింగ్​ సెంటర్లకు సర్కార్​ పర్మిషన్​ ఇవ్వలేదు. అయినా మేనేజ్​మెంట్లు ఓపెన్​ చేశాయి. ఒక్కో హాల్​లో వందల మందిని కుక్కి కోచింగ్​ ఇస్తున్నాయి. బిల్డింగ్​ సేఫ్టీ, శానిటరీ, కరోనా గైడ్​లైన్స్​​ఇవేవీ పాటించడం లేదు. కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం తనిఖీలు చేపట్టి రూల్స్​ ఉల్లంఘించే ఇనిస్టిట్యూట్​లపై చర్యలు తీసుకోవాలి.

– కేఎస్​ ప్రదీప్​, పీవైఎల్​ స్టేట్​ జనరల్​ సెక్రటరీ

For More News..

జైళ్లలో పెడితే భయపడతమా? జైళ్లే బీజేపీ విజయానికి నాంది

బెల్టు షాపులు తెరిచి యువతను లిక్కర్‌కు బానిసలు చేస్తున్నరు

మేం తిట్టుడు స్టార్ట్​ చేస్తే ప్రధానిని కూడా వదలం