శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఏడడుగుల నాగుపాము ప్రత్యక్షం

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఏడడుగుల నాగుపాము ప్రత్యక్షం

శ్రీశైలం మల్లన్న ఆలయంలో నాగుపాము సంచారం భక్తులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రేపు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో నాగుపాము ప్రత్యక్షం స్వామివారి మహిమగా భావిస్తున్నారు భక్తులు.

శ్రీస్వామి,అమ్మవారి కళ్యాణ మండపం పక్కనే ఉన్న రంధ్రం ద్వారా ఏడడుగుల నాగుపాము సంచారంతో ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇచ్చారు. ఆలయానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కాళీ చరణ్ పామును పట్టుకొని అటవీప్రాంతంలో వదిలారు.