
పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో జరిగింది. కోడి పందేల్లో భాగంగా ఓ కోడిపుంజుకి కత్తిని కడుతుండగా ఒక్కసారిగా కాళ్లు విదిలించింది. దీంతో ఆ కత్తి పందేలని చూడగానికి వెళ్లిన సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తికి తొడభాగంలో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కుడన్న వారు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు.. ఆయన అప్పటికే మృతిచెందాడని తెలిపారు.