సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: బాలికపై తండ్రి వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మహిళ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. తన ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి స్థానిక గొల్ల బజారులోని డబుల్ బెడ్రూమ్ సముదాయంలో నివసిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన బాలిక(16) తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో తల్లికి చివ్వేంల మండలం మున్యానాయక్ తండాకు చెందిన బాణోత్ శ్రీనుతో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తున్నారు.
పది రోజుల క్రితం తల్లి కూలి పనికి వెళ్లినపుడు ఒంటరిగా ఉన్న బాలికపై శ్రీను అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడిన బాలిక చెప్పలేదు. దీనిని అలుసుగా తీసుకుని వేధిస్తుండడంతో విషయాన్ని తల్లికి చెప్పింది. బాలికతో కలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనును అరెస్ట్ చేశారు.