ఓటర్​ అప్లికేషన్లను పరిశీలించాలి : హనుమంతు జెండగే

ఓటర్​ అప్లికేషన్లను పరిశీలించాలి : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు: ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చిన 6, 7, 8 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. సోమవారం ఆత్మకూర్ (ఎం) తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. 

ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉన్నందున చేర్పులు,  తొలగింపులకు సంబంధించిన పనులను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన వారందరికి ఓటు హక్కు కల్పించాలని, స్పష్టమైన తుది ఓటరు జాబితాకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట కార్యక్రమంలో తహసీల్దార్ జల కుమారి, ఆర్​ఐ మల్లికార్జునరావు ఉన్నారు.