భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు : కలెక్టర్ అభిలాష అభినవ్ 

భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు : కలెక్టర్ అభిలాష అభినవ్ 

ఆదిలాబాద్/బెల్లంపల్లి/లక్ష్మణచాంద(మామడ)/కాగజ్ నగర్, వెలుగు: ప్రజల భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా భూభారతి గ్రామ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మామడ మండలంలోని ఆరేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. రెండో విడత సదస్సులు ఈనెల 20 వరకు నిర్వహిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్డీవో రత్నకల్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో జరుగుతున్న సదస్సును ఆర్డీవో హరికష్ణ, తహసీల్దార్ కృష్ణ కలిసి కలెక్టర్ ​కుమార్​ దీపక్ పరిశీలించారు. దరఖాస్తులను సర్వే, రికార్డులతో పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కౌటాల మండలం పార్దిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్ పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో అందే దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ధరణి పోర్టల్ తో రైతులు ఇబ్బందులు పడ్డారు

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రూరల్ మండలం తంతోలిలో చేపట్టిన రెవెన్యూ సదస్సును ఎమ్మెల్యే సందర్శించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.