ప్రజావాణికి 451 అర్జీలు

ప్రజావాణికి 451 అర్జీలు

హైదరాబాద్, వెలుగు: లక్డీకపూల్​లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 451 అర్జీలు అందినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చి సిటిజన్లు అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్య ప్రకాశ్, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ సురేందర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆశన్న, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్: కొంగరకలాన్​లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 298 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తారని.. వారి ఫిర్యాదులను అధికారులు శాఖల వారీగా పరిశీలించాలన్నారు. అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.