ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి : కలెక్టర్​ఆశిశ్ సంగ్వాన్​

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను  వేగవంతం చేయాలి : కలెక్టర్​ఆశిశ్ సంగ్వాన్​

లింగంపేట, వెలుగు: పేదప్రజలకు  ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్​ ఆశిశ్ సంగ్వాన్​ అన్నారు. బుధవారం ఆయన లింగంపేట మండలంలోని ముస్తాపూర్  గ్రామానికి  చెందిన జూకంటి అనిత కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించి ఇంటినిర్మాణానికి భూమి పూజ చేశారు.​ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను  మంజూరు చేస్తోందని ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తోందన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను తొందరగా నిర్మించుకోవాలని   సూచించారు.  కలెక్టర్​వెంట జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి సురేందర్, ఎంపీఓ మలహరి, ఏపీఎం శ్రీనివాస్​ఉన్నారు.

భూములను పరిశీలించిన కలెక్టర్​

లింగంపేట మండలం  పోతాయిపల్లి శివారులోని సర్వే నెంబర్​899లో గల భూములను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ బుధవారం పరిశీలించారు. 899 సర్వేనెంబర్​ లోని భూములను గ్రామానికి చెందిన రైతులు ఏళ్లతరబడి సాగు చేస్తున్నా  ఫారెస్టు ఆఫీసర్లు అటవీ భూమి అని పేర్కొంటూ  ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామ రైతులు భూభారతిలో దరఖాస్తు చేశారు. దాంతో కలెక్టర్​ ప్రత్యేకంగా  భూములను  పరిశీలించారు.  అనంతరం కోమట్‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  కలెక్టర్​ పరిశీలించారు.

  కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తూకాలు పూర్తయ్యాయని బస్తాలను లారీలలో నింపి రైస్​ మిల్లులకు తరలించాల్సి ఉందని సెంటర్​ నిర్వహకులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పారు. కలెక్టర్​ వెంట అదనపు కలెక్టర్​ (రెవెన్యూ) విక్టర్, బాన్సువాడ సబ్​కలెక్టర్ కిరణ్మయి, భూభారతి మండల ప్రత్యేక అధికారి రాజేందర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్​ రాజేందర్​, సివిల్​సప్లయ్​జిల్లా అధికారి మల్లికార్జున్​బాబు,​ స్థానిక తహసీల్దార్​ సురేశ్ ​, ఆర్ఐ కిరణ్​ 
ఉన్నారు.