
కామారెడ్డి టౌన్, వెలుగు : ‘భూభారతి’ అప్లికేషన్లు పరిశీలిస్తున్నామని, ఇప్పటికే 7,269 నోటీసులు జారీ చేశామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ సదస్సులు, వనమహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లు, సీజనల్ వ్యాధులపై సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లలో 27,223 ఆన్లోన్లో అప్లోడ్ చేశామన్నారు.
సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. డీఎఫ్వో నిఖిత, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్, డీఆర్డీవో సురేందర్, హౌజింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, హార్టికల్చర్ అధికారి జ్యోతి, డీఎంహెచ్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన కలెక్టర్..
నషాముక్త్ భారత్ అభియాన్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మొక్కలు నాటారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్, జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.