కామారెడ్డి జిల్లాలో భారతి’ అప్లికేషన్లు పరిశీలిస్తున్నాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో భారతి’ అప్లికేషన్లు పరిశీలిస్తున్నాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : ‘భూభారతి’ అప్లికేషన్లు పరిశీలిస్తున్నామని, ఇప్పటికే 7,269 నోటీసులు జారీ చేశామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ సదస్సులు, వనమహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లు,  సీజనల్ వ్యాధులపై సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లు, అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లలో 27,223 ఆన్​లోన్​లో అప్​లోడ్​ చేశామన్నారు. 

 సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. డీఎఫ్​వో నిఖిత, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్,  డీఆర్డీవో సురేందర్,  హౌజింగ్ పీడీ విజయ్​పాల్​రెడ్డి, హార్టికల్చర్​ అధికారి జ్యోతి, డీఎంహెచ్​వో చంద్రశేఖర్ పాల్గొన్నారు.  

మొక్కలు నాటిన కలెక్టర్..​ 

నషాముక్త్​  భారత్​ అభియాన్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్​లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మొక్కలు నాటారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్,  జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.