
కామారెడ్డిటౌన్, వెలుగు : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో శుక్రవారం వరకు జరిగిన సదస్సుల్లో 31 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. వీటిపై సోమవారం నుంచి పరిశీలన చేయాలన్నారు.
భూ సర్వే అప్లికేషన్లను క్లియర్ చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కంప్లీట్ అయి ఏదైనా కారణం చేత లబ్ధిదారులకు కేటాయించకుండా ఉంటే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.