
- ఆసిఫ్నగర్ హైస్కూల్ హెచ్ఎంపై కలెక్టర్ ఆగ్రహం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘క్లాస్రూమ్లో డిజిటల్ బోర్డ్ పనిచేయకపోతే మీరేం చేస్తున్నారండీ.. మీరు బాధ్యత తీసుకోకపోతే ఎట్లా?’ అంటూ ఆసిఫ్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎంపై కలెక్టర్ హరిచందన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె ఆసిఫ్నగర్ప్రభుత్వ హైస్కూల్ను విజిట్చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి క్లాస్రూమ్కు వెళ్లి స్టూడెంట్స్తో మాట్లాడారు. ఒక క్లాస్రూంలో డిజిటల్క్లాస్రూం పని చేయడం లేదని తెలుసుకుని హెచ్ఎంను ప్రశ్నించారు. ఇంటర్నెట్, ఇతర సమస్యలున్నాయని చెప్పగా, అన్నీ తొందర్లోనే పరిష్కారం కావాలన్నారు.
ప్రైవేట్స్కూల్స్కు దీటుగా డిజిటల్క్లాస్రూంల నిర్వహణ ఉండాలని, టీచర్లందరికీ డిజిటల్ క్లాసులపై అవగాహన ఉండాలన్నారు. స్కూల్లో నీటి సమస్య ఉందని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, వాటర్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వాటర్ ట్యాంక్, టాయిలెట్స్ఎప్పడికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ బి వెంకటేశ్వర్లు, హెచ్ఎం షేక్ మొహమ్మద్ సులేమాన్ ఉన్నారు.