కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్

కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్

కామారెడ్డిటౌన్​, వెలుగు: పోలింగ్​సెంటర్లలో అన్ని రకాల సౌలతులు కల్పిస్తున్నామని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్​ అన్నారు.  గురువారం పోలింగ్​ ఏర్పాట్లపై  జహీరాబాద్​ పార్లమెంట్​ అబ్జర్వర్ గోపాల్​జి తివారీ, వ్యయ పరిశీలకులు మోతిలాల్​షెటే,  సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూర్​తో  జరిగిన వీసీలో కామారెడ్డి కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​,  ఎస్పీ సింధూశర్మలు పాల్గొన్నారు. 

కలెక్టర్​ మాట్లాడుతూ..  ఎండాకాలం దృష్ట్యా, పోలింగ్ సెంటర్లలో తాగునీటి సౌకర్యం, షామియానాతో పాటు వీల్ చైర్, కరెంట్, ఫస్ట్ ఎయిడ్ లాంటి సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. ఓటర్లకు ఎవరూ  ప్రలోభపెట్టకుండా నిఘా పెంచామన్నారు.  ఎస్పీ మాట్లాడుతూ.. బార్డర్​ చెక్​పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచామని, నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు.