![ఎగ్జామ్ సెంటర్స్లో కలెక్టర్ తనిఖీ](https://static.v6velugu.com/uploads/2024/03/collector-jitesh-v-patil-inspected-many-ssc-exam-centers-in-kamareddy-district_pUQOLlgC7W.jpg)
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని పలు ఎస్సెస్సీ ఎగ్జామ్ సెంటర్లను శనివారం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తనిఖీ చేశారు. దేవునిపల్లి జడ్పీ హైస్కూల్, గౌతమ్ మాడల్ స్కూల్స్లోని సెంటర్లను ఆయన పరిశీలించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మ్యాథ్స్ ఎగ్జామ్కు 23 మంది స్టూడెంట్స్ గైర్హజరైనట్లు డీఈవో రాజు తెలిపారు. 62 సెంటర్లలో 11,962 మంది స్టూడెంట్స్కు గాను 11,939 మంది హాజరయ్యారు.