
- కలెక్టర్ క్రాంతి
పటాన్చెరు, వెలుగు: స్టూడెంట్స్ఇష్టంతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. 2024–-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 10 తరగతిలో ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్కు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం పటాన్చెరులోని జీఎంఆర్ఫంక్షన్హాల్ లో ఏర్పాటు చేయగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఏడేళ్లుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా పదో తరగతిలో ర్యాంకులు పొందిన స్టూడెంట్స్కు రూ.9 లక్షలు పంపిణీ చేసి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
అనంతరం మొదటి బహుమతి రూ.3000, ద్వితీయ బహుమతి రూ.2000, తృతీయ బహుమతి రూ.1000 దాదాపు 450 మంది స్టూడెంట్స్కు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎస్పీ పరితోశ్ పంకజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్టీచర్లు, స్టూడెంట్స్పాల్గొన్నారు . అనంతరం పటాన్చెరు పరిధిలోని రుద్రారంలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలోని రేషన్ షాప్2ను సందర్శించారు.
సన్న బియ్యం లబ్ధిదారులతో మాట్లాడి బియ్యం ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి ఇండ్లను నాణ్యతతో నిర్మించాలని సూచించారు. బేస్మెంట్పూర్తి చేసిన వారికి రూ.లక్ష అందించినట్లు తెలిపారు. ఆమె వెంట నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.