భీమారం మండలం బూరుగుపల్లి అంగన్వాడీలో అక్షరాభ్యాసం చేయించిన కలెక్టర్

భీమారం మండలం బూరుగుపల్లి అంగన్వాడీలో అక్షరాభ్యాసం చేయించిన కలెక్టర్

జైపూర్(భీమారం), వెలుగు: పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ప్రారంభించిందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం భీమారం మండలం బూరుగుపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్​తో కలిసి ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల సంక్షేమం దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి 2 సార్లు ఎగ్ బిర్యానీ అందించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. అంగన్వాడీ సెంటర్​లో కొత్తగా చేరిన పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు.

మండల కేంద్రంలో నిర్మిస్తున్న పీహెచ్​ని పరిశీలించి పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. కేజీవీబీ స్కూల్​ను తనిఖీ చేసి స్కూళ్లు ప్రారభమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రారంభం రోజునే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ కల్పన, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మెనూ పాటించాలి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: అమ్మ మాట అంగన్‌వాడి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్​పట్టణంలోని సంజయ్​నగర్​1వ నంబర్​అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి హాజరయ్యారు. కేంద్రంలో సెల్పీ కటౌట్ వద్ద చిన్నారులతో కలసి సెల్ఫీలు దిగారు. మెనూలో ఏర్పాటు చేసిన ఎగ్ ​బిర్యానీని చిన్నారులతో కలిసి తిన్నారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందజేయా లని ఆదేశించారు. సీడీపీవో వనజ, సూపర్​వైజర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ యశోద తదితరులు పాల్గొన్నారు.