ఏటీసీలతో అధునాతన సాంకేతిక విద్య : కలెక్టర్ కుమార్ దీపక్

ఏటీసీలతో అధునాతన సాంకేతిక విద్య : కలెక్టర్ కుమార్ దీపక్

    ఇయ్యాల మూడు సెంటర్ల ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా నిరుద్యోగ యువతకు అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మందమర్రిలోని ఏటీసీని కలెక్టర్ శుక్రవారం ​ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నూతన పరికరాల ద్వారా అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు  ప్రభుత్వం ఏటీసీలను ఏర్పాటు చేసిందన్నారు. 

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని వృత్తి విద్యలో నైపుణ్యత సాధించి ఉపాధి పొందాలని సూచించారు. శనివారం మంచిర్యాల, మందమర్రి, నస్పూర్​లో ఏసీటీ సెంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం మందమర్రి ఎంపీడీవో ఆఫీస్​ను సందర్శించి మండల పరిధిలో కొనసాగుతున్న పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ ​వెంట తహసీల్దార్​ సతీశ్ ​కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్​తదితరులున్నారు.