మిషన్​ భగీరథను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక అల

మిషన్​ భగీరథను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక అల

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండలం తోగ్గూడెం మిషన్​ భగీరథ వాటర్​ ప్లాంట్​ను కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదివారం  సందర్శించారు. గ్రిడ్​ నుంచి నీటి సరఫరా, రోజువారీ నీటి డిమాండ్​ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి శుద్ధి ప్రక్రియలోని దశలను పరిశీలించారు. వేసవిలోనూ ప్రతి ఇంటికీ నల్లానీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. 

మిషన్​ భగీరథ ఏఈలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మిషన్​ భగీరథ నుంచి నీటి సరఫరా లేని ప్రాంతాలకు బావులు, బోర్లు ద్వారా నీళ్లు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. వాటర్​ ట్యాంక్​ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి చుట్టూ క్లోరినేషన్​ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మిషన్​ భగీరథ ఈఈ తిరుమలేశ్, పాల్వంచ మున్సిపల్ ​ఇంజినీర్లు, పాల్వంచ ఎమ్మార్వో, ఎంపీడీవో పాల్గొన్నారు.