ఆదిలాబాద్టౌన్, వెలుగు: రైతుల కోసం ఆదిలాబాద్మార్కెట్ యార్డులో ఇస్కాన్ ట్రస్ట్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రాజర్షి షా ఎమ్మెల్యే పాయల్శంకర్, డీసీసీబీ చైర్మన్అడ్డి భోజారెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
రైతులకు రూ.10 కే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్క పూట భోజనానికి ఒక్కొక్కరికి రూ.35 చొప్పున ఖర్చవుతుండగా.. రూ.15 మార్కెటింగ్ శాఖ, రూ.10 ఇస్కాన్ ట్రస్ట్ , రూ.10 రైతుల కాంట్రిబ్యూషన్ తో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు. జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలుంటయ్
యువత క్రీడారంగంలో రాణిస్తే ఉపాధి అవకాశాలుంటాయని, వాటిని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్న్యూ హౌసింగ్ బోర్డులోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్తదితర పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు ట్రోఫీలు అందజేశారు. క్రీడల్లో రాణించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. డీవైఎస్ వో శ్రీనివాస్, డీఐఈవో గణేశ్జాదవ్ తదితరులున్నారు.
