
గుడిహత్నూర్, వెలుగు: భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలోని ధంపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై, మాట్లాడారు. రైతులు అందజేసిన దరఖాస్తులను తహసీల్దార్ లాగిన్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. 7 రోజుల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇన్చార్జి తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. బడీడు పిల్లలను బడి బయట ఉంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అనంతరం కళాకారులు రూపొందించిన బడిబాట పాటల సీడీని ఆవిష్కరించారు. డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో ఉదయ్రావు, ఎంపీడీవో అబ్దుల్ హై, హెచ్ఎం సంతోష్ కుమార్, టీచర్లు ఉన్నారు.