జనగామ జిల్లాలో పక్కాగా ఆన్లైన్ జీరో పర్మిట్ విధానం : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ జిల్లాలో పక్కాగా ఆన్లైన్ జీరో పర్మిట్ విధానం : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: జిల్లాలో ఆన్​లైన్ ​జీరో పర్మిట్​సిస్టమ్​ను పక్కాగా అమలు చేయాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో ఇసుక, కంకర తదితర ఖనిజ వనరులకు సంబంధించి ఆన్​లైన్ జీరో పర్మిట్​సిస్టం, టీజీ ఎండీసీ ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై మైనింగ్, టీజీ ఎండీసీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్​తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా పైన ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

ఆన్​లైన్​ జీరో పర్మిట్​ను అధికారులు తప్పకుండా అమలు చేయాలన్నారు. రహదారుల రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయిల్​పామ్​విస్తీర్ణం పెంపుపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ లోని జడ్పీ హైస్కూల్ ను కలెక్టర్ సందర్శించి డిజిటల్ బోధన తీరును విద్యార్థుల సామర్థ్యాలను కలెక్టర్​పరిశీలించారు. మెనూ పాటించాలని, యూనిఫాం తప్పనిసరని, విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్​ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో మైనింగ్​శాఖ ఏడీ విజయ్​కుమార్, పట్టుపరిశ్రమ శాఖ అధికారి శ్రీధర్, డీఏవో రామారావు నాయక్, సహకారి శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, మేనేజర్ శంకర్, డీఈవో భోజయ్య  పాల్గొన్నారు.