టార్గెట్ మేరకు లోన్లు ఇవ్వాలి : కలెక్టర్ సంతోష్

టార్గెట్  మేరకు లోన్లు ఇవ్వాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : జిల్లాలో టార్గెట్  మేరకు ప్రజలకు, రైతులకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్  సంతోష్  సూచించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్  హాల్ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి బ్యాంకర్ల మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రతి నెలా టార్గెట్  రీచ్ అయిన  వివరాలను గ్రామపంచాయతీ ఆఫీస్, రైతు వేదికల్లో చెప్పాలన్నారు. చిన్న వ్యాపారాలకు కూడా లోన్స్  ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. వివిధ రకాల స్కీముల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

ఆర్బీఐ ఆఫీసర్  దిబోజిట్ బేరా, ఎల్డీఎం అయ్యప్ప రెడ్డి, డీఏవో గోవింద్​నాయక్, వెటర్నరీ ఆఫీసర్  వెంకటేశ్వర్లు ఉన్నారు. అనంతరం టీఎస్ఎంఐడీసీ, డీఎంహెచ్ వో, ఇంజనీరింగ్, మిషన్  భగీరథ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి గద్వాల, అలంపూర్  హాస్పిటళ్లలో అన్ని సౌలతులు కల్పించాలన్నారు. రైస్​ మిల్లర్లతో మీటింగ్​ నిర్వహించి ఈ నెల 20లోగా సీఎంఆర్​ అందించాలని ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్  శ్రీనివాసులు, డీఎం విమల, కనకయ్య ఉన్నారు.