
పర్వతగిరి(సంగెం), వెలుగు: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్రిజిస్టర్లు, గోదాం, తూకం యంత్రాలు, రసీదు పుస్తకాలను పరిశీలించారు.
యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. రైతులు అవసరం మేరకు యూరియా వాడాలని సూచించారు. ఏవో యాకయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, పీఎసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.