టెన్త్, ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలె : కలెక్టర్ ఇలా త్రిపాఠి

టెన్త్, ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలె : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్​, వెలుగు:  టెన్త్​, ఇంటర్​ పరీక్షలు సజావుగా జరిగేలా  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలకు తావు ఇవ్వొదన్నారు. బుధవారం ఆమె కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి ఇంటర్​ ఫైనల్​ పరీక్షలు జరుగనుండగా ఫస్ట్​ ఇయర్​ 19,299, సెకెండ్​ ఇయర్​ 17,664 కలిపి మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం అరెంజ్​మెంట్స్​ చేయాలన్నారు.

మార్చ్ 14 నుంచి షురువయ్యే టెన్త్ ఎగ్జామ్స్ జిల్లాలో 24,542 మంది రాయనున్నారని ఇందులో 143 ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఆన్సర్​ షీట్స్​ పట్ల కూడా అంతే అప్రమత్తత కనబర్చాలన్నారు. క్లీన్​ వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని ఆశావర్కర్లు, ఏఎన్​ఎంల సేవలు తీసుకోవాలన్నారు. పరీక్షలు జరిగే టైంకు బస్​లు నడిచేలా ప్లాన్​ చేయాలని,  సెంటర్లకు చేరువలోని జిరాక్స్​ సెంటర్లు క్లోజ్​ చేయించాలని, సెల్​ఫోన్లు అనుమతించొద్దన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా సంబంధిత ఆఫీసర్లను బాధ్యులను చేస్తామన్నారు. అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​, జిల్లా ఇంటర్మీడియేట్​ ఆఫీసర్​ రవికుమార్​, డీఈవో అశోక్​, ఏసీపీ మస్తాన్​అలీ   ఉన్నారు.

సాలూరా తహసీల్దార్​కు నోటీస్​

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను ఏ మాత్రం అనుమతించమని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాలూరా మండలంలో రెండు ఇసుక వాహనాలు పట్టుబడడాన్ని సీరియస్​గా పరిగణించి అక్కడి తహసీల్దార్​ శశిభూషణ్​కు షోకాజ్​ నోటీస్​ జారీ చేశామని  బుధవారం ఒక ప్రకటలో వెల్లడించారు. పర్మిషన్​ లేకుండా ఎవరైనా  ఇసుక ట్రాన్స్​పోర్టు చేస్తే తహసీల్దార్లు పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ చేయాలన్నారు.