![సోషల్ మీడియాపై నిఘా పెట్టినం : వెంకట్ రావు](https://static.v6velugu.com/uploads/2023/11/collector-venkat-rao-says-they-kept-an-eye-on-announcements-and-news-on-social-media_HQiRN2zpOq.jpg)
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై నిఘా పెట్టామని కలెక్టర్ వెంకట్ రావు చెప్పారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను మంగళవారం అడిషనల్ కలెక్టర్ ప్రియాంకతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్ తదితర సామాజిక మాద్యమాల్లో అభ్యర్థుల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తున్నామని చెప్పారు.
సోషల్ మీడియాలో ప్రచారాలకు సంబంధించి ఈ కేంద్రం ద్వారా ముందుగా అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ను దాటి సోషల్ మీడియాలో వచ్చే ప్రసారాలను పరిశీలనలో తీసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేశ్, సీపీవో వెంకటేశ్వర్లు, డీపీఆర్వో రమేశ్ కుమార్, డీఐఈ మల్లేశం, ఏవో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.