పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, విద్యతోనే గౌరవం సాధ్యమని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్​గిరిజన సంక్షేమ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 1,500 మంది చిన్నారులను బడుల్లో చేర్పించామని  తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు, గణితం, సైన్స్ సబ్జెక్టులను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా బుక్స్, నోట్​బుక్స్, యూనిఫామ్ ​ఇస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 

నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం

కాగజ్‌నగర్‌, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనిందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కలెక్టర్ వెంకటేశ్​ ధోత్రే అన్నారు. తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. శుక్రవారం కాగ జ్ నగర్ మండలం భట్టుపల్లి మండల పరిషత్ స్కూల్లో బాడిబాట కార్యక్రమంలో భాగంగా సాముహిక అక్షరాభ్యాసం  నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తో కలిసి కలెక్టర్​హాజరయ్యారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.  జిల్లా సైన్స్ ఆఫీసర్ మధుకర్, తహసీల్దార్ మధుకర్, ఎంపీడీవో ప్రసాద్, ఎంఈవో ప్రభాకర్  పాల్గొన్నారు.

విద్యారంగ బలోపేతానికి చర్యలు

జైపూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అనేక చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్​అన్నారు. శుక్రవారం ఇందారం జెడ్పీ హైస్కూల్, టేకుమట్ల, కిష్టాపూర్ ఎంపీపీఎస్ లతోపాటు టేకుమట్ల అంగన్వాడీ సెంటర్​ను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్​లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

టేకుమట్ల, కిష్టాపూర్ లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు తహసీల్దార్​వనజారెడ్డితో కలిసి హాజరయ్యారు. భీమారం తహసీల్దార్ ఆఫీస్​ను విజిట్ చేశారు. దరఖాస్తుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. ఆఫీస్​కు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు. తహసీల్దార్ సదానందం, ఎస్సై శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

జాతర్లలో సామూహిక అక్షరాభ్యాసం

బజార్ హత్నూర్, వెలుగు: జాతర్ల గ్రామంలో గల శ్రీ నాగోబా వేంకటేశ్వర ఆలయ సముదాయం వద్ద సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ తరఫున మాడగుడ, పార్డి, పాట్నాపూర్ పాఠశాలల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై, చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అక్షరాభ్యాసంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన తండాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. గిరిజన పాఠశాలల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.