ప్రతి రోజు రెండు గ్రామాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేయండి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

ప్రతి రోజు రెండు గ్రామాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేయండి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

రోజుకు రెండు గ్రామాల్లో రక్త నమూనాలు సేకరించాలి

నిజామాబాద్​, వెలుగు : టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రతి రోజు రెండు గ్రామాల్లో చేయాలని నిజామాబాద్​కలెక్టర్​ టి.వినయ్​కృష్ణారెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మెడికల్​ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​మాట్లాడారు. రక్త పరీక్షలో పాజిటివ్​  వచ్చిన వారి కుటుంబీకులకు అవగాహన కల్పించాలన్నారు.  ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులకు రెగ్యులర్​గా మెడిసిన్స్​ పొందుతున్నారా? లేదా ? అని తెలుసుకోవాలన్నారు.  డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ, టీబీ కంట్రోలింగ్ ఆఫీసర్ డాక్టర్ దేవీనాగేశ్వరీ, జిల్లా ఇమ్యూనైజేషన్​ ఆఫీసర్ డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్ల నిర్మాణాలు షురూ చేయించండి..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు షురూ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శనివారం మున్సిపల్​ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈ, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  మహిళా సంఘాల ద్వారా బ్యాంక్​ లింకేజీ కింద రూ.లక్ష రుణం ఇప్పించి బేస్మెంట్ పూర్తి చేయించాలన్నారు.  వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్​, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్, హౌసింగ్ ఆఫీసర్​ నివర్తి, ఈడీఎం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నగరంలోని పెయింటర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను,దుబ్బ కాలనీలో అభయహస్తం కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్​ను  కలెక్టర్ పరిశీలించారు.