
రోజుకు రెండు గ్రామాల్లో రక్త నమూనాలు సేకరించాలి
నిజామాబాద్, వెలుగు : టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రతి రోజు రెండు గ్రామాల్లో చేయాలని నిజామాబాద్కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్లో కలెక్టర్మాట్లాడారు. రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబీకులకు అవగాహన కల్పించాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రెగ్యులర్గా మెడిసిన్స్ పొందుతున్నారా? లేదా ? అని తెలుసుకోవాలన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, టీబీ కంట్రోలింగ్ ఆఫీసర్ డాక్టర్ దేవీనాగేశ్వరీ, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలు షురూ చేయించండి..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు షురూ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శనివారం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈ, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ కింద రూ.లక్ష రుణం ఇప్పించి బేస్మెంట్ పూర్తి చేయించాలన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్, హౌసింగ్ ఆఫీసర్ నివర్తి, ఈడీఎం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నగరంలోని పెయింటర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను,దుబ్బ కాలనీలో అభయహస్తం కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్ను కలెక్టర్ పరిశీలించారు.