స్కూళ్లలో వసతులపై ఫోకస్ పెట్టండి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

స్కూళ్లలో వసతులపై ఫోకస్ పెట్టండి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : సర్కార్​ బడులన్నింటిలో మౌలిక వసతులు ఉండేలా ఎంఈవోలు ఫోకస్​ పెట్టాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండలాల వారీగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్స్​, కరెంట్​, తాగునీటి సౌకర్యం లేని స్కూల్స్ ఉండడానికి వీలులేదన్నారు. ఇచ్చిన నిధులు అన్నిచోట్ల ఖర్చు చేస్తూ పనులు షురూ చేయాలన్నారు. 

స్టూడెంట్స్ ఫేషియల్​ అటెండెన్స్​ వంద శాతం జరగాలని, యూడైస్​ పోర్టల్​లో ఆధార్​ వివరాలు ఎన్​రోల్​ చేయాలన్నారు. అపార్ జనరేట్​ చేయని స్కూల్స్​కు నోటీసులు అందిస్తామన్నారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్​కు భోజనాలు పెట్టాలని, హెల్త్​ చెక్​అప్​ రెగ్యూలర్​గా చేయించాలన్నారు. భవిత సెంటర్స్​, వయోజన విద్యపై రివ్యూ నిర్వహించారు. అడిషనల్​కలెక్టర్ అంకిత్​, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్​, ఎంఈవోలు ఉన్నారు.

వెటర్నరీ సేవలు పెంచాలె..

పాడి రైతులకు వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.  పశుసంవర్థక శాఖ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. సీజన్​ వారీగా పశువులకు సోకే వ్యాధులను గుర్తించి ట్రీట్​మెంట్ అందించాలని, వాక్సినేషన్ చేయాలన్నారు. పశువైద్య వాహనం వద్దే చికిత్సలు జరిగేలా చూడాలని, డాక్టర్ల కొరత ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వెటర్నరీ శాఖ జేడీ డాక్టర్ రోహిత్​రెడ్డి తదితరులు ఉన్నారు.