
- మిల్లర్లకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ వార్నింగ్
- ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం
- ధాన్యం బస్తాలు వెంటనే దించుకునేలా చూడాలని సూచన
- మిల్లర్లకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ వార్నింగ్
- విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం
- బస్తాలు వెంటనే దించుకునేలా చూడాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు, తేమ పేరుతో తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లయ్స్ కమిషనర్ వి.అనిల్ కుమార్ హెచ్చరించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు తాలు, తరుగు పేరిట పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులు నివేదించాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు వచ్చిన ధాన్యం బస్తాలను వెంటనే దించుకునేలా చూడాలని ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రైతులు ఒకేసారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17లోపు ఉండేలా ఆరబెట్టి తాలు లేకుండా తెచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు.
సమన్వయంతో ముందుకెళ్లాలి
కొనుగోలు ప్రక్రియ సాఫీగాసాగేలా వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార విభాగాలతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ సూచిం చారు. తాలు, తరుగు పేరుతో మిల్లర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలతోపాటు ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధర తది తర ఫిర్యాదుల కోసం ప్రతీ జిల్లా కేంద్రంలో టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని, అదేవిధంగా, హైదరాబాద్లోని సివిల్సప్లయ్స్ భవన్లో 1967,180042500333 టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాదిలో 25.35లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు.