రంగారెడ్డి జిల్లా: దేశంలో ప్రజాసేవకులు కనుమరుగయ్యారన్నారు సీపీఎం నేతలు. మొదటి నుంచి ప్రజలకు ఎర్రజెండానే అండగా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జెండా ఆవిష్కరించి ప్రారంభించారు నేతలు. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకుండా ఆనాడు నిలబెట్టింది.. కార్మికుల హక్కులను కాపాడింది కమ్యూనిస్టులేనన్నారు. జనంకోసం పోరాడిన ఘనచరిత్ర వామపక్షాలదేనన్నారు.
ఇవి కూడా చదవండి
కొండా వర్సెస్ చల్లా.. మాటల యుద్ధం
మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్