కమ్యూనిస్టులు తెలంగాణలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించారు

కమ్యూనిస్టులు తెలంగాణలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించారు

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే కేరళకు చెందిన ఎం.కె.వెల్లోడిని హైదరాబాద్​కు పౌర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, 1952  ఫిబ్రవరిలో దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాద్​ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు పడ్డాయి. హైదరాబాద్​ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండేవి. తెలంగాణలో ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​, మెదక్​, హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నల్లగొండ, వరంగల్,  మరఠ్వాడలో ఔరంగాబాద్​, పర్బని, నాందేడ్​, ఉస్మానాబాద్​, బీరార్​, కన్నడలో బీదర్​, గుల్బర్గా, రాయచూర్​ జిల్లాలు ఉండేవి. 

16 జిల్లాల్లో 142 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో 33 ద్విసభ్య నియోజకవర్గాలు. అంటే ఈ 33 స్థానాల్లో ఒక జనరల్​ ప్రతినిధితోపాటు మరో రిజర్వు ప్రతినిధి కూడా ఎన్నికవుతాడు. ఈ విధంగా 142 నియోజకవర్గాలు, అదనంగా 33 మంది రిజర్వు అభ్యర్థులు కలిపి మొత్తం 175 మంది శాసనసభ్యులు హైదరాబాద్​ రాష్ట్రంలో ఎన్నికయ్యారు. 

హైదరాబాద్​ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రధానంగా ఐదు పార్టీలు పాల్గొన్నాయి. 

1. కాంగ్రెస్ (93 సీట్లు గెలుచుకుంది)
2. పీపుల్స్​ డెమొక్రటిక్​ ఫెడరేషన్​ (42 సీట్లు గెలుచుకుంది)
3. పీజెంట్స్​, వర్కర్స్​ పార్టీ    (10 సీట్లు గెలుచుకుంది)
4. సోషలిస్ట్​ పార్టీ (11 సీట్లు గెలుచుకుంది)
5. షెడ్యూల్డ్​ క్యాస్ట్​ ఫెడరేషన్​ పార్టీ (5 సీట్లు గెలుచుకుంది)
6. స్వతంత్రులు (14 సీట్లు గెలుచుకున్నారు )

ఎన్నికల్లో పాల్గొన్న జాతీయ పార్టీలు 

ఆల్​ ఇండియా భారతీయ జనసంఘ్​, అఖిల భారతీయ హిందూ మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్​, కిసాన్​ మజ్దూర్​ ప్రజా పార్టీ, అఖిల భారతీయ రామ్​ రాజ్య పరిషత్, ఆల్​ ఇండియా షెడ్యూల్​ క్యాస్ట్​ ఫెడరేషన్, సోషలిస్టు పార్టీ

ప్రాంతీయ పార్టీలు

హైదరాబాద్​ స్టేట్​ డిప్రెస్డ్​ క్లాసెస్​ అసోసియేషన్​, హైదరాబాద్​ స్టేట్​ ప్రజా పార్టీ, ఇండిపెండెంట్​ లీగ్​, పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​, పీజెంట్స్​ అండ్​ వర్కర్స్​ పార్టీ, ఆల్​ ఇండియా రిపబ్లికన్​ పార్టీ, యునైటుడ్​ షెడ్యూల్డ్​ క్యాస్ట్​ ఫెడరేషన్ 

హైదరాబాద్​ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 90,21,680 కాగా 52,02,214 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమ్యూనిస్టులు తెలంగాణలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించారు. మరఠ్వాడ, కన్నడ ప్రాంతాల్లో పెద్దగా విజయాలు సాధించలేకపోయారు. రావి నారాయణరెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్లమెంట్​కు దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో జయసూర్య, పెండ్యాల రాఘరావులు కూడా పార్లమెంట్​, అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. వీరు కూడా అసెంబ్లీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్​ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు జరిగింది. చివరికి బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్​ శాసనసభ నాయకుడిగా ఎన్నికయ్యాడు. హైదరాబాద్​ రాజ్​ ప్రముఖ్​ మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1952 మార్చి 6న కింగ్​ కోఠిలోని తన నివాసంలో బూర్గుల రామకృష్ణారావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. 

బూర్గుల రామకృష్ణారావు   మంత్రివర్గం
బూర్గుల రామకృష్ణారావు   ముఖ్యమంత్రి
బిందు దిగంబరరావు       హోం మంత్రి
జి.ఎస్​.మెల్కోటే               ఆర్థిక మంత్రి
అన్నారావు గనముఖి       స్థానిక పాలన
మర్రి చెన్నారెడ్డి                పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ
దేవిసింగ్​ చౌహాన్​               గ్రామీణాభివృద్ధి శాఖ
పూల్​చంద్​ గాంధీ              విద్య, ఆరోగ్యం
సి.జగన్నాథరావు                న్యాయశాఖ
నవాజ్​జంగ్​ బహదూర్​     పబ్లిక్​ వర్క్స్​
శంకర్​ డియో                      సోషల్​ సర్వీసెస్​
వి.బి.రాజు                           కార్మిక, ప్రణాళిక, సమాచారశాఖ
కొండా వెంటకరంగారెడ్డి    ఎక్సైజ్​, కస్టమ్స్​, అటవీశాఖ
కొరటికర్​ వినాయకరావు    పరిశ్రమలు, వాణిజ్యం

ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్​ముఖ్​ పాండే (మరఠ్వాడ)
ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్టు/ పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫెడరేషన్​
హైదరాబాద్​ రాష్ట్ర స్పీకర్​ కాశీనాథరావు వైద్య
డిప్యూటీ స్పీకర్​ పంపనగౌడ్ సక్రిప్ప