కొవిన్లో ఎంట్రీ చేసుకోలేని వృద్ధుల కోసం ఏర్పాటు చేయాలన్న కేంద్రం
కోల్డ్చైన్ సిస్టమ్ పక్కాగా ఉండాల్సిందేనని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు రిజిస్ట్రేషన్చేసుకునేందుకు కమ్యూనిటీ సర్వీస్సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. సొంతంగా రిజిస్ట్రేషన్చేసుకునే చాన్స్ ఉన్నప్పటికీ కోవిన్ సాప్ట్వేర్పై అవగాహనలేని వారి కోసం ఇతర ఏర్పాట్లు చేయాలని చెప్పింది. గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డ్రైరన్, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఫస్ట్ఫేజ్లో వ్యాక్సిన్ తీసుకునే హెల్త్కేర్ వర్కర్స్ వివరాలు కొవిన్ సాఫ్ట్ వేర్లో రిజిస్ట్రేషన్ చేసే విషయం హెల్త్ డిపార్ట్మెంట్కోఆర్డినేట్చేస్తుంది. అయితే 50 ఏండ్లు పైబడిన, యాభై ఏండ్లలోపు ఉండి దీర్ఘకాలిక అనారోగ్యం బాధపడుతున్న వారు వ్యాక్సిన్కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇవి మండలాల వారీగా ఉండలా ? గ్రామాల వారీగా ఉండాలా అనేదానిపై లోకల్ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
బ్లాక్లెవెల్లో రిజిస్ట్రేషన్కు మెడికల్ఆఫీసర్ఇన్చార్జిగా ఉంటారు. వ్యాక్సిన్రిజిస్ట్రేషన్ కోసం ఓటర్ల లిస్ట్ఉపయోగించుకోనున్నారు. వ్యాక్సినేషన్లో లోటుపాట్లు, ఇబ్బందులు తలెత్తితే వాటిని శుక్రవారం మళ్లీ నిర్వహించే డ్రైరన్లో పరిష్కరించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సినేషన్కోసం రాష్ట్రాలకు రూ.480 కోట్లు సెంట్రల్ఫైనాన్స్మినిస్ట్రీ విడుదల చేసింది. ఆపరేషనల్కాస్ట్కింద ఈ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వనుంది. వ్యాక్సిన్ తీసుకునే ఒక్కో వ్యక్తికి రూ.160 చొప్పున ఖర్చు కింద ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నరు. వ్యాక్సినేషన్పై రాష్ట్రాల చీఫ్సెక్రటరీలతో కేబినెట్సెక్రటరీ ఈ నెల 11న మరోసారి రివ్యూ చేయనున్నారు.
త్రీ లెవెల్వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్
నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ఫర్కరోనా వ్యాక్సినేషన్ ను మూడు లెవెల్స్లో పర్యవేక్షించనుంది. రాష్ట్రస్థాయిలో చీఫ్సెక్రటరీ అధ్యక్షతన స్టేట్స్ర్కీనింగ్కమిటీ(ఎస్ఎస్సీ), ప్రిన్సిపల్సెక్రటరీ హెల్త్ ఆధ్వర్యంలో స్టేట్టాస్క్ఫోర్స్, స్టేట్కంట్రోల్రూమ్పనిచేయనుంది. అలాగే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్టాస్క్ఫోర్స్, అర్బన్టాస్క్ఫోర్స్, డిస్ట్రిక్కంట్రోల్రూం పనిచేస్తుంది. ఇక బ్లాక్లెవెల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో బ్లాక్టాస్క్, బ్లాక్కంట్రోల్రూంలు వ్యాక్సినేషన్ప్రక్రియలో పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గైడ్లైన్స్, ఆర్డర్స్ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో, బ్లాక్లెవెల్లో 61 వేల మంది ప్రొగ్రామ్మేనేజర్స్, 1.9 లక్షల వ్యాక్సినేటర్లు, 3.3 లక్షల మంది వ్యాక్సినేషన్టీమ్మెంబర్స్ ట్రైనింగ్పూర్తి చేసుకున్నారు.
1075 కాల్సెంటర్
వ్యాక్సినేషన్పై డౌట్లు, సమాచారం తెలుసుకునేందుకు 1075 స్టేట్కాల్సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒకవేళ బిజీ ఉంటే నేషనల్హెల్త్అథారిటీ కాల్సెంటర్కు, లేదా టీబీ సెంటర్కు కాల్ట్రాన్స్ఫర్చేస్తారు.
For More News..
భూమి స్పీడ్ పెరిగింది! రోజులు వేగంగా గడుస్తున్నయ్..
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కు కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు
- తెలంగాణం
- January 8, 2021
లేటెస్ట్
- రామనవమి వేడుకల్లో బీజేపీ హింసను ప్రేరేపించింది : బెంగాల్ సీఎం మమత
- అగ్రికల్చర్ కోర్సులకు ఐకార్
- మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు
- ఉపాధి కూలీల మీద పడ్డ బండరాయి
- 50 ఫోన్లు రికవరీ...బాధితులకు అందజేత
- బాలానగర్ లో గంజాయి పట్టివేత
- సికింద్రాబాద్ స్థానానికి 10 నామినేషన్లు
- కడియం నన్ను ఇబ్బంది పెట్టిండు: తాటికొండ రాజయ్య
- నేత కార్మికులకు రూ. 50 కోట్లు
- బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్రెడ్డి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి