ఖమ్మం జిల్లా మధిర అటవీశాఖ అధికారుల పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. "M G N R E G S" పధకం ద్వారా హరితహారం నర్సరీలలోని మొక్కల పెంపకాలలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అటవీశాఖ మధిర రేంజ్ పరిధిలో కొంతమంది అధికారులు కోట్లరూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్కూరు గ్రామానికి చెందిన పగిడిపల్లి నాగరాజు తెలంగాణ లోకాయుక్తలో కంప్లైంట్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆ శాఖ పరిధిలో టెక్నికల్ అసిస్టెంట్(తాత్కాలిక పద్దతిలో)గా నాగరాజు పనిచేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్
మేడారం జాతర ఫొటో గ్యాలరీ