కౌశిక్​ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు.. మానసిక స్థితి సరిగా లేదని కంప్లైంట్

కౌశిక్​ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు.. మానసిక స్థితి సరిగా లేదని కంప్లైంట్

 హుజూరాబాద్​ బీఆర్ఎస్​ అభ్యర్థి పాడి కౌశిక్​ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయనకు వెంటనే చికిత్స అందించి రక్షణ కల్పించాలని వీణవంక మండలానికి చెందిన గెల్లు రాజేందర్​ యాదవ్..​ జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ప్రచారం చివరి రోజున కౌశిక్  రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని, హుజూరాబాద్​ నియోజకవర్గ ఒటర్లను ఇది భయభ్రాంతులకు గురిచేయడమే అని రాజేందర్  పేర్కొన్నారు. ఆయన మానసిక స్థితి సరిగా లేనందునే అలా మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కౌశిక్​తో పాటు ఆయన భార్య, కూతుర్లకు రక్షణ కల్పిచాలని కోరారు. కౌశిక్​ రెడ్డికి మానసిక చికిత్సని అందించాలని, ఆయనకు ఏదైనా జరిగితే ఎన్నికల అధికారులే బాధ్యత వహించాలని రాజేందర్  అన్నారు.