డిగ్రీ సెమిస్టర్​ ఎగ్జామ్​ సెంటర్​ ముందు స్టూడెంట్ల ఆందోళన

డిగ్రీ సెమిస్టర్​ ఎగ్జామ్​ సెంటర్​ ముందు స్టూడెంట్ల ఆందోళన

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని  గవర్నమెంట్​డిగ్రీ కాలేజీలో మంగళవారం డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుండగా గంట ముందే ఆన్సర్​ షీట్లను తీసుకున్నారని స్టూడెంట్స్​ ఆందోళనకు దిగారు. ఎగ్జామ్​ పేపర్​లో 3గంటల సమయం ఉందని రెండు గంటలకే ఎలా తీసుకుంటారని ఇన్విజిలేటర్​తో వాగ్వాదానికి దిగారు. 

ప్రిన్సిపల్​ పతంజలి వివరణ కోరగా.. సెమిస్టర్ ఎగ్జామ్​కు  యూనివర్సిటీ ఆఫీసర్లు రెండు గంటలు మాత్రమే ఇచ్చారని, క్వశ్చన్​ పేపర్​లో మాత్రం 3గంటల సమయం ఇచ్చినట్లు ప్రింట్​ అయ్యిందన్నారు.  అయినప్పటికీ ఎగ్జామ్​ రాస్తున్న స్టూడెంట్స్​కు 3గంటల సమయం ఇచ్చామని తెలిపారు.