ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్..RRR బ్యూటీ అలియా భట్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెలలో వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రణబీర్, అలియా భట్ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారు.అయితే రణబీర్, అలియా వివాహ ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే వారి కుటుంబ సభ్యులు మాత్రం ముంబై చెంబూర్ ప్రాంతంలోని ఆర్కే హౌస్ లో వివాహం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవల రణ్బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ సెలబ్రిటీ డిజైనర్ మానిష్ మల్హోత్రా స్టోర్కెళ్లి వచ్చారు. తర్వాత మనీష్ మల్హోత్రా.. కపూర్ ఇంటికెళ్లారు. తాజాగా రణ్బీర్ కపూర్, ఆలియా భట్ తాజాగా తాము నటిస్తున్న సినిమాల షూటింగ్ తేదీల షెడ్యూల్ కోసం తమ ప్రొడ్యూసర్లను అడిగి తెలుసుకున్నారు. తమ వివాహం కోసం షూటింగ్ షెడ్యూల్లో ఫ్రీ డేట్స్ గురించి ఆరా తీశారని సమాచారం.
మరిన్ని వార్తల కోసం