
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో గందరగోళం నెలకొంది. తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని మొదటి నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారణిలు ఆందోళనకు దిగారు. పదువులు కాకపోయిన కనీసం గౌరవం కూడా లేదంటూ నినాదాలు చేశారు. వేదికపై ఉన్నవారు 90 శాతం బయటి నుంచి వచ్చిన వాళ్ళేనని ఆరోపణలు చేశారు. అటు ఈ వేడుకలకు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు డుమ్మా కొట్టారు.