బయో మైనింగ్ తో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

బయో మైనింగ్ తో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను బయో మైనింగ్ విధానంలో కంపోస్టు ఎరువుగా మార్చే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఆయన నగరంలోని నారాగంలోగల డంపింగ్​ యార్డ్​ విజిట్​ చేసి బయో మైనింగ్​ జరుగుతున్న తీరు పరిశీలించి మాట్లాడారు. ఇందుకోసం ఇప్పుడు వినియోగిస్తున్న యంత్రాలతో పాటు మరో రెండు వేస్టేజ్ ప్రాసెసింగ్ మెషిన్స్ తెప్పించి కాంట్రాక్ట్​ ఏజెన్సీకి అప్పగించాలన్నారు. 

బయో మైనింగ్​తో ఉత్పత్తి చేసిన కంపోస్టు ఎవరికి సప్లయ్ చేస్తున్నారో తెలుసుకున్నారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్ట, రైల్వే కమాన్​, గాయత్రీనగర్​ ప్రధాన కూడళ్లు చెక్ చేశారు. రోడ్లపై చెత్తను పారేయకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, ఉల్లఘించే వారికి విధించే జరిమానాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.  ప్రతి ఇంటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేరువేరుగా వాహనాల్లో సేకరించాలని, డ్రైనేజీ క్లీనింగ్​కు జేసీబీలు వినియోగించాలని, గ్రీనరీ పెంపునకు విరివిగా మొక్కలు పెంచాలని కోరారు. నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్, డిప్యూటీ కమిషనర్​ రవిబాబు, ఇన్​చార్జి ఎంహెచ్​వో సాజిద్ తదితరులు ఉన్నారు.